చాలా మందికి పెరుగుని ఇష్టంగా తీసుకుంటారు. దీంతో ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అయితే, తోడు పెట్టినప్పటికీ కొంతమందికి పెరుగు గడ్డలా తోడుకోదు. కానీ, స్వీట్హౌజెస్లో గడ్డలా పెరుగు ఉంటుంది. అలా ఇంట్లోనే పెరుగు తోడుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి. నిమ్మరసం..
పెరుగుని తోడుపెట్టినప్పుడు ముందుగా ఓ రెండు మూడు చుక్కల నిమ్మరసం కలపండి. మరీ ఎక్కువగా కాదు. రెండు చుక్కలు చాలు. అయితే, ఇది ఆప్షనల్ మాత్రమే. వేసినా వేయకపోయినా పెరుగు తోడుకుంటుంది. కాబట్టి, ఒకటి రెండు చుక్కల నిమ్మరసం వేస్తే వేయొచ్చు.
మిర్చి..
పెరుగుని తోడు పెట్టినప్పుడు ఓ మిరపకాయ కూడా వేయండి. దీని వల్ల పెరుగు చక్కగా, చిక్కగా, రుచిగా తోడుకుంటుంది. మిరిపకాయల్లోని కొన్ని రకాల బ్యాక్టీరియా పాల రేణువులని పూర్తిగా పీల్చుకుని గట్టిగా తోడుకుంటుంది. ఇది మరింత క్రీమీగా, తీపిగా తోడుకుంటుంది. Also Read : కుక్కర్, పాత్ర.. ఎందులో వండిన అన్నం మంచిది..
ఎలా తోడుపెట్టాలి..
తోడు పెట్టడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతిలో ఓ కప్పు పాలని బాగా మరిగించి ఓ కుండలో పోయండి. తర్వాత అందులో మిర్చి వేయండి. కొద్దిగా నిమ్మరసం వేయండి. అయితే నిమ్మరసం ఆప్షనల్. దీనిని వేయకపోయినా పర్లేదు. Also Read : మసాలా పదార్థాలు ఎక్స్పైర్ అయ్యాయని ఎలా గుర్తించాలి..
తయారైన పెరుగుని ..
ఇలా తయారైన పెరుగుని అలానే ఉంచాలి. దీంతో పెరుగు గడ్డలా తోడుకుంటుంది. ఈ పెరుగుని మరుసటి రోజు ఫ్రిజ్లో పెట్టండి. తర్వాత హ్యాపీగా పెరుగుని ఎంజాయ్ చేయడమే.