డైనోసార్ల కంటే పవర్ ఫుల్.. అణు బాంబు పడినా కూడా తట్టుకోగలదు..మన ఇంట్లోనే తిరుగుతుంటది
బొద్దింక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కీటకంగా పరిగణించబడుతుంది. ఇలాంటి వింత కీటకం మరొకటి లేదు. ఇవి పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ డైనోసార్ల కంటే శక్తిమంతమైనవని. అంతే కాదు ప్రపంచంలో వీటి ఆహారం కానిది ఏదీ లేదు.. ఇవి ప్రతిచోటా కనిపిస్తాయి. వాటికి అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయి. ఎవరైనా వాటి కాలును పట్టుకుంటే, ఈ బొద్దింకలు వెంటనే ఆ కాలును వాటి శరీరం నుండి వేరు చేసుకొని పారిపోతాయి. ఆ ప్రదేశంలో మళ్లీ కొత్త కాళ్లు పెరుగుతాయి. బొద్దింకలలో చాలా అద్భుతమైన, ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు బొద్దింకలకు ప్రకృతి ఈ వింత గుణాన్ని ఇచ్చింది. బొద్దింకలు తమను తాము రక్షించుకునే అన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. భూమిపై అణుయుద్ధం జరిగినప్పటికీ, అవి మనుగడ సాగిస్తాయి. చిన్న శరీరాలు కలిగిన బొద్దింకలు భారీ డైనోసార్ల కంటే బలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా ఈ కారణంగా=, గ్రహశకలం భూమిని ఢీకొట్టినప్పుడు, డైనోసార్లు అదృశ్యమైనప్పటికీ బొద్దింకలు సజీవంగా ఉన్నాయి. బొద్దింకలు కూడా తమ శరీరాలను ఆశ్చర్యకరంగా కుదించగలవు, ఎందుకంటే వాటి శరీరాలు చాలా చదునుగా ఉంటాయి. దీని కారణంగా అవి బాహ్య ప్రభావం చేరుకోలేని అనేక ప్రదేశాలకు తమను తాము రవాణా చేయగలవు. ఇరుకైన పగుళ్లలో కూడా ప్రవేశిస్తాయి. తాకిడి సంభవించినప్పుడు, భూమి యొక్క ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి.. చాలా జంతువులకు దాక్కోవడానికి కూడా చోటు దొరకదు. కానీ వేడి నుండి తప్పించుకోవడానికి బొద్దింకలు నేల పగుళ్లలో దాక్కుంటాయి, ఇది వేడి నుండి తప్పించుకోవడానికి గొప్ప ప్రదేశం. బొద్దింకను బూట్లతో తొక్కినా అది సజీవంగానే ఉంటుంది. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే అవి కుంచించుకుపోయి గుండ్రంగా మారతాయి. అప్పుడు అక్కడ గుండ్రటి వస్తువు పడి ఉన్నట్టు చూస్తారు. అంటార్కిటికా మినహా ప్రపంచంలో ఈ బొద్దింకలు కనిపించని ప్రదేశం లేదు. వాటిని అంటార్కిటికాలో వదిలేసినా.. విపరీతమైన చలిలో కూడా 3 రోజులు బతికేస్తాయి. అవి ప్రతిదీ జీర్ణించుకోగలుగుతాయి. సబ్బు, వాల్ పేపర్, పెయింట్, టపాసుల జిగురు, గుడ్డ, బుక్ బైండింగ్లు, టీవీ లోపల కేబుల్స్, మరెన్నో బొద్దింకల ఆహారంలో చేర్చబడ్డాయి. ఈ బొద్దింకలు నదులు, కాలువల్లో కూడా తమకు నచ్చిన ఆహారాన్ని పొందుతాయి. బొద్దింక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కీటకంగా పరిగణించబడుతుంది. దాదాపు 35 మిలియన్ సంవత్సరాల నుండి బొద్దింకలు ఈ భూమిపై ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం, బొద్దింక నేడు ఉన్న వేలాది కీటకాలకు పూర్వీకుడు. ఈ బిలియన్ల సంవత్సరాలలో కూడా బొద్దింకలలో కొద్దిపాటి మార్పు మాత్రమే వచ్చిందంటే.. వాటి పరిమాణం మాత్రమే.
2024-05-20T13:33:51Z
Fortune Things: ఈ 7 వస్తువులను మీ దగ్గర పెట్టుకుంటే.. జీవితంలో డబ్బుకు లోటుండదు!
ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో మన వెంట కొన్ని వస్తువులను తీసుకెళ్తుంటాం. ఈ రోజుల్లో జేబులో ఫోన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కొందరు వ్యాలెట్ క్యారీ చేస్తుంటారు. అయితే అనవసర వస్తువులను వదిలేసి, కొన్ని రకాల వస్తువులను వెంట తీసుకెళ్లడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా 7 రకాల వస్తువులు మీ దగ్గర ఉంటే, అదృష్టం ఎప్పుడూ మీవెంటే ఉంటుంది. సంపద, ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతాయని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. మరి ఆ వస్తువులేంటో చూద్దాం. బియ్యం గింజవాస్తు శాస్త్రం ప్రకారం.. జేబులో లేదా పర్సులో బియ్యం గింజ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ధన, ధాన్య వృద్ధి సిద్ధిస్తుంది. అందరికీ శుభం కలుగుతుంది. రావి ఆకురావి చెట్టు మనందరికీ సుపరిచితమే. శాస్త్రం ప్రకారం.. రావి చెట్టు అనేక సద్గుణాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని శుభప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టి ఈ చెట్టు ఆకును జేబులో లేదా బ్యాగులో ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఈ ఆకును అట్టిపెట్టుకుంటే రావి చెట్టును పూజించిన ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా సంపద వృద్ధి కలుగుతుంది. చేసే పనులు సక్సెస్ అవుతాయి. శ్రీ యంత్రంఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చిన్నపాటి శ్రీ యంత్రాన్ని తీసుకెళ్లాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఇది మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది, ఫ్యామిలీలో సుఖ, సంతోషాలను నింపుతుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఈ యంత్రం మీ జేబులో ఉంటే, చేసే పనుల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. తామర వేర్లునీటిలో ఉండే తామర చెట్టు వేర్లు కూడా చాలా మంచివి. అందుకే తామర వేర్లను జేబులో లేదా బ్యాగులో పెట్టుకోవడం మంచిది. వీటిలో ఉండే పవిత్రత మీలో సానుకూల శక్తిని ఏర్పరచడానికి సహాయ పడుతుంది. సంపద సృష్టికి ఇది కారణం అవుతుంది. గోమతి చక్రంవాస్తు శాస్త్రంలో గోమతి చక్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని మీ దగ్గర పెట్టుకుంటే సిరిసంపదలు మీ సొంతం అవుతాయి. కుటుంబంలో సుఖ, సంతోషాలను తెస్తుంది. ఈ చక్రం మీ వెంట ఉంటే.. మంచి ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతాయని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. లక్ష్మీ విగ్రహంసంపదకు చిహ్నం లక్ష్మీ దేవత. ఈ దేవతా మూర్తి చిన్న విగ్రహాలను ఎల్లప్పుడూ వెంట తీసుకెళ్లాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ముఖ్యంగా, ఏనుగులపై కూర్చున్నట్లుగా ఉండే లక్ష్మీ దేవత చిత్రపటాన్ని వ్యాలెట్లో పెట్టుకుంటే సంపద, సౌభాగ్యం కలుగుతాయి. వెండి నాణెంమీ దగ్గర ఎప్పుడూ వెండి నాణేన్ని ఉంచుకోవడం మంచిదని వాస్తు పండితులు చెబుతారు. దీనివల్ల సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖ, శాంతులు నెలకొంటాయి. సౌభాగ్యాన్ని కల్పించే శక్తి ఈ నాణేనికి ఉంటుందని శాస్త్రం చెబుతోంది. (Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)
2024-05-21T10:21:55Z
Panchangam Today: నేటి పంచాంగం. సాయంత్రం శుభం
నేడు 2024 మంగళవారం, మే 21, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. శ్రీనృసింహ జయంతి ఇవాళ 5 గంటల 21 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి త్రయోదశి సాయంత్రం 5 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. తర్వాత చతుర్దశి.వారం: జయవాసరెనక్షత్రం: స్వాతి, రోజంతా ఉంటుంది.యోగం: వ్యతీపాత, మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వరీయాన్కరణం: తైతుల, సాయంత్రం 5 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. తర్వాత గరజి పూర్తిగా ఉంటుంది. అమృతకాలం రాత్రి 10 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 57 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుంచి 9 గంటల 12 నిమిషాల వరకు ఉంది. తిరిగి రాత్రి 11 గంటల 6 నిమిషాల నుంచి 11 గంటల 50 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం మధ్యాహ్నం 11 గంటల 49 నిమిషాల నుంచి, 1 గంట 33 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-05-21T00:05:01Z