ముఖం మెరవాలంటే కచ్చితంగా బ్యూటీపార్లర్స్, ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన పనిలేదు. ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. అందులో ద్రాక్ష, దోసకాయని వాడి ప్యాక్ వేయడం. దీని వల్ల చర్మంలోని అలసట తగ్గి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందుకోసం ఏమేం పదార్థాలు కావాలి.. ఎలా ప్యాక్ వేయాలో తెలుసుకోండి. కావాల్సిన పదార్థాలు..
ద్రాక్ష పండ్లు 5నిమ్మరసం : కొన్ని చుక్కలుదోసకాయ రసం : 1 టేబుల్ స్పూన్
బీట్రూట్ మాయిశ్చరైజర్ తయారీ
దోసతో బెనిఫిట్స్..
దోసకాయ రసం మొటిమల్ని తగ్గిస్తుంది. ముడతలు లేకుండా చర్మాన్ని కాపాడుతుంది. దీని వల్ల స్కిన్ హైడ్రేటెడ్గా ఉండి ఉబ్బిన కళ్ళు తగ్గిపోతాయి. అంతేకాకుండా చర్మానికి చాలా మంచిది కూడా.
ద్రాక్షతో లాభాలు..
చర్మానికి ద్రాక్ష పండ్ల రసాన్ని పూయండి. దీని వల్ల చర్మం మెరుస్తుంది. ఇది యాంటీ ఏజింగ్లా పనిచేసి సన్ బర్న్ తగ్గుతుంది. మచ్చలు తగ్గుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. Also Read : మొటిమలు, మచ్చలు తగ్గట్లేదా.. ఈ ప్రోడక్ట్స్ వాడండి..
నిమ్మరసం..
నిమ్మరసంలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. ఇది కొల్లాజెన్ని పెంచి నల్లమచ్చల్ని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుతుంది. మొటిమల్ని తగ్గుతాయి. Also Read : కొబ్బరిపాలలో వీటిని మిక్స్ చేసి అప్లై చేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది..
ఎలా తయారుచేయాలి?
ముందుగా ద్రాక్ష పండ్లని రసంలా చేయాలి. దీనిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే దోసకాయ రసం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ రసాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిపోయే వరకూ 15 నిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయండి.
ఎన్నిసార్లు..
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మెరిసే అందమైన చర్మం మీ సొంతమవుతుంది. దీని వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Beauty News and Telugu News