పెరుగులోకి ఉప్పు కలుపుకోవాలా లేక పంచదార.. ఆరోగ్యానికి ఏది మంచిది..

Curd With Sugar : ఏ సీజన్‌లో ఉన్నా, జనాలు పెరుగును ఆహారంతో పాటు తినడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే, వేసవి కాలంలో దీని డిమాండ్ మరింతగా ఉంటుంది. కొంతమంది పెరుగును చక్కెరతో, మరికొందరు ఉప్పుతో రుచి చూస్తారు. అదే సమయంలో, పెరుగులో ఏమీ కలపకుండా తినే వారు కూడా ఉంటారు. కానీ, అలా చేయడం తప్పు. ఎందుకంటే పెరుగు స్వభావం వేడిగానే కాకుండా ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి ఏమీ కలపకుండా తినకూడదు. అలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ఇక ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగులో ఉప్పు లేదా పంచదార ఏది వేసుకోవాలి. ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయితే వాస్తవం ఏమిటి? లక్నోలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రికి చెందిన డాక్టర్ సర్వేష్ కుమార్ దీని గురించి న్యూస్ 18 కి వివరంగా చెప్పారు.

రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలని ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పారని డాక్టర్ సర్వేష్ కుమార్ తెలియజేశారు. అలాగే రోజూ పెరుగు తినకుండా ఉంటే మంచిదని.. అంతే కాదు, సాధారణ పెరుగు తినడానికి బదులు, అందులో తేనె, నెయ్యి, పంచదార, ఉసిరికాయలను కలుపుకుని తింటే ఇంకా మంచిదని తెలిపారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయట.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారాన్ని రుచిగా మార్చగల సామర్థ్యం ఉప్పుకు ఉంది. అందువల్ల, పెరుగులో కొద్ది మొత్తంలో ఉప్పు కలపడం వల్ల పెద్దగా హాని జరగదు. మీరు రాత్రిపూట పెరుగును తినేటప్పుడు, వైద్యులు ఉప్పును జోడించమని సూచిస్తారు, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇది శరీరం నుండి విషపూరిత మూలకాలను కూడా తొలగిస్తుందట. అయితే పెరుగు స్వభావం ఆమ్లంగా ఉంటుంది కనుక.. ఇది కడుపులో గ్యాస్‌ను సృష్టిస్తుంది. అందువల్ల, పెరుగులో ఎక్కువగా ఉప్పు కలపడం మానుకోవాలి.

పెరుగులో ఉప్పు, చక్కెర ఏది ఎక్కువ ప్రయోజనకరం?

పెరుగులో ఉప్పు కలిపి రోజూ తింటే చర్మ సమస్యలు వస్తాయి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, జుట్టు అకాల నెరసిపోవడం, చర్మంపై మొటిమలు ఏర్పడతాయి. అందువల్ల, పెరుగులో ఉప్పు కలపడం మానుకోవాలి. చక్కెర గురించి మాట్లాడేటప్పుడు, పెరుగులో చక్కెర కలిపి తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. నిజానికి పెరుగులో పంచదార కలిపితే దాని రుచి ఇంకా బాగుంటుంది. తింటే ఎలాంటి హాని ఉండదు. పెరుగులో బెల్లం కలపడం కూడా చాలా మేలు చేస్తుంది.

---- Polls module would be displayed here ----

అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు అస్సలు కలపకూడదు. అధిక రక్తపోటు ఉన్నవారు పెరుగులో ఉప్పు కలపకూడదని వైద్యుల సూచన. ఇది స్ట్రోక్, రక్తపోటు, డిమెన్షియా, ఇతర గుండె జబ్బుల అవకాశాలను పెంచుతుంది. రెండవది, పెరుగులో ఉప్పు కలిపి తింటే అందులో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.

పెరుగును లస్సీ తయారు చేసి తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఆయుర్వేద ఆచార్య ప్రకారం, ఎండాకాలంలో పెరుగు లస్సీ తాగడం మంచిది. పెరుగులో పంచదార కలిపినప్పుడు, చల్లబడి, వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీరానికి శక్తి అందుతుంది. రిఫ్రెష్ గా అనిపిస్తుంది. లస్సీ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అయితే, అధిక వినియోగం మంచిది కాదు.

2024-04-16T09:32:13Z dg43tfdfdgfd