ఫోన్, బట్టలు లేదా ఇంకేదైన కొందామనుకుంటున్నారా..? ఈ ఛాన్స్ అస్సలు మిస్సవకండి..

అద్భుతమైన ఆఫర్‌లతో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2 నుంచి భారతదేశంలో ప్రారంభం కానుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యూటీ ప్రొడక్ట్‌లు, ట్యాబ్లెట్‌లు, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ టీవీలు, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి మీ ఇంటికి కావాల్సినవన్నీ డిస్కౌంట్ ధరకే ఆర్డర్ చేసుకోవచ్చని అమెజాన్ ప్రకటనలో తెలిపింది. 

మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ ఆన్ లైన్ ద్వారా  మొదలవుతుంది. అయితే Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉన్న కస్టమర్‌లు మధ్యాహ్నం 2:00 గంటల నుండి మొదట ఆర్డర్ చేయవచ్చు. అయితే ఈ సేల్ లో మొబైల్ ఫోన్లు 40 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయని సమాచారం. అంతేకాదు ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా వన్ ప్లస్, రెడ్‌మి ఇంకా  రియల్‌మీతో సహా బ్రాండ్‌ల ప్రొడక్ట్స్ తక్కువ ధరకే లభిస్తాయి. 

ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు, టాబ్లెట్‌లు ఇంకా  స్మార్ట్‌వాచ్‌లపై 70 శాతం వరకు, హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తాయి. టీవీలు ఇంకా  హోమ్ అప్లియన్సెస్ పై 65 శాతం వరకు డిస్కౌంట్, వంటగది నిత్యావసరాలపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. బట్టలు, బ్యూటీ  ప్రొడక్ట్స్ పై  50 శాతం నుండి 80 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. అయితే ఆఫర్ బ్రాండ్‌ను బట్టి మారుతుంది. వీటి ధరలను మాత్రం అమెజాన్ రిలీజ్  చేయలేదు.  

ఈ యూనివర్సల్ డిస్కౌంట్‌లతో పాటు ICICI, Bank of Baroda, OneCardని ఉపయోగించి షాపింగ్ చేసే వారికి అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్  కూడా ఉంది. మొదటిసారి అమెజాన్ కస్టమర్లు 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. షరతులకు లోబడి EMI నిబంధనలపై కూడా ఆర్డర్ చేయవచ్చు.

2024-04-30T08:02:13Z dg43tfdfdgfd