Panchangam Today: నేటి పంచాంగం. ఇవాళ ఐదు శుభ సమయాలు
నేడు 2024 శనివారం, మే 18, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మ జయంతి. శబరిమల అయ్యప్పస్వామి దేవతా విగ్రహ ప్రతిష్టాపనా దినం. ఇవాళ 5 గంటల 37 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి దశమి ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఏకాదశి.వారం: మంద/స్థిరవాసరెనక్షత్రం: ఉత్తర, రాత్రి 12 గంటల 21 నిమిషాల వరకూ ఉంది. తర్వాత హస్త.యోగం: హర్షణ, ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వజ్రకరణం: గరజి, ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వణిజ రాత్రి 12 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భద్ర.పితృతిథి: శుక్ల ఏకాదశిశుభసమయాలు: తె:04.13 (మేష), ఉ:9.23(మిధున), రా:10.12(ధనస్సు), రా:11.33(మకర), రా.తె:4.09(మేష). అమృతకాలం సాయంత్రం 4 గంటల 14 నిమిషాల నుంచి 6 గంటల 2 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 47 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 5 గంటల 47 నిమిషాల నుంచి, 7 గంటల 13 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-05-18T00:38:03Z
ఇక్కడికి వెళ్ళిన చిన్నారులు సైలెంట్ గా అస్సలు ఉండరట.. ఎందుకో మీరే చూడండి !
ఐదేండ్ల చిన్నారుల నుండి మొదలుకొని 60, 70 ఏళ్ళ వయసు వాళ్ళ వరకు కూడా ఇక్కడికి ఈత కోసం వస్తున్నారు. ఈతరాని కొందరు పిల్లలు, పెద్దలు వచ్చి ఈత నేర్చుకుంటుండగ.. ఈత వచ్చిన మరికొందరు ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. ఎండా కాలంలో కావడంతో పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో ఈత నేర్చుకోవడానికి వస్తున్నారు. చిన్నారులతో పాటుగా వస్తున్న తల్లిదండ్రులు, ఈత నేర్చుకుంటున్న చిన్నారులతో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. అయితే ఏదో వేసవి సెలవులకే పరిమితం కాకుండా నిరంతరం ఈత సాధన చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఈత శిక్షకుడు కొమ్ము కృష్ణ పేర్కొన్నారు. మొత్తం మీద ప్రతిరోజు ఈత నేర్చుకోవడానికి వస్తున్న పిల్లలు, పెద్దలతో కళకళలాడుతున్న ఈత కొలను ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇలా వేసవి సెలవుల్లో ఈత నేర్చుకోవడం చాలా ఆనందంగాను, సరదాగాను ఉందని ఇక్కడికి వస్తున్న చిన్నారులు అంటున్నారు. కాగా ఈత నేర్చుకోవడం ద్వారా ఆనందంతోపాటు ఆరోగ్యం కూడా లభిస్తోందని ఇక్కడికి ఈత నేర్చుకోవడానికి వస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు అంటున్నారు. ఇది ఉంటే గత కొన్ని దశాబ్దాల నుండి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈత కొలనును నిర్వహిస్తున్నారు. ఇక్కడలో ఈతలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా శిక్షకులతోపాటు సహాయకులు, రక్షకులు కూడా ఉన్నారు. శిక్షకుడు కొమ్ము కృష్ణ ఇక్కడికి వచ్చే చిన్నారులు, పెద్దలకు ఈతలో మెళకువలను చెబుతూ ఈత శిక్షణ ఇస్తున్నారు. ఈయన గత 18 సంవత్సరాల నుండి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఉన్న ఈత కొలను చిన్నారులు, పెద్దలతో కళకళలాడుతోంది. ఆరోగ్యంతోపాటు ఆనందాన్ని పంచుతోంది. చిన్నా పెద్దా అందరు వచ్చి ఈతకొడుతూ సరదగా గడుపుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఈత కొలనుకు వస్తున్న చిన్నారుల సంఖ్య మిగతా రోజులకంటే బాగా ఎక్కువగానే పెరిగింది. కాగా ఈ ఈత కొలను దాదాపు రెండు లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో మూడు, నాలుగు, ఐదు, ఆరు అడుగుల లోతులో ఈత శిక్షణ ఇస్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా శిక్షణనిస్తుంటారు. సుమారు 500 మందికి పైగా పిల్లలు, పెద్దలు బ్యాచులుగా వారిగా ఇక్కడికి వచ్చి ఈత నేర్చుకుంటున్నారు. మహిళలను కూడా ప్రత్యేక సమయాల్లో ఈ ఈత కొలనులోకి అనుమతినిస్తూ వారికి కూడా శిక్షణనిస్తున్నారు. కాగా కొందరు తల్లిదండ్రులు చిన్నారుల వెంట వచ్చి, సమయం అయ్యేంత వరకు అక్కడే ఉండి పిల్లలచే ఈత కొట్టించి తీసుకెళుతున్నారు.
2024-05-17T16:37:07Z
Marriage: పెళ్లైన పురుషులే ఎక్కువ కాలం బతుకుతారంట.. కారణం ఏంటంటే..!
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇక పెళ్లి తర్వాత ఆడ, మగవారి శరీరంలో, జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మగవారికి బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు, సంసారం, జాగ్రత్త పెరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే పెళ్లైన తర్వాత ఎక్కువ కాలం బతుకుతారని సైన్స్ చెబుతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం. పెళ్లి చేసుకున్న పురుషులలో మరణ ప్రమాదం 15% మాత్రమే ఉందంట. అదే సమయంలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉందని చెపుతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం. పెళ్లి చేసుకున్న పురుషులలో మరణ ప్రమాదం 15% మాత్రమే ఉందంట. అదే సమయంలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉందని చెపుతోంది. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 6,23,140 మందిపై ఈ పరిశోధనలు జరిగాయి. వారితో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఈ అధ్యయనం చేశారు. జపాన్ పరిశోధకులు ఈ పరిశోధనను 15 సంవత్సరాలలో పూర్తి చేశారు. పెళ్లైన జంటలు ప్రమాదాలు, గాయాలు లేదా గుండె జబ్బులతో మరణించే అవకాశం 20 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. దీనికి కారణం లేకపోలేదు. బ్యాచిలర్ అబ్బాయిలు సంపాదన, ఎంజాయ్ పేరుతో తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద చూపలేరు. అంతేకాదు రిస్క్ తీసుకోడానికి కూడా వారు వెనకాడరు. దీనివల్లే వీరి ఆయుష్షు తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నాయి. అదే సమయంలో పెళ్లై వారు తమ ప్రాణాలను ఎక్కువ రిస్క్ లో పెట్టరు. ఎందుకంటే వారిని నమ్ముకొని ఇంట్లో ఓ కుటుంబం ఉందని వెనకడుగు వేస్తాయి. మద్యం ఎక్కువ సేవించరు. మాదక ద్రవ్యాల జోలికి ఎక్కగా పోరు. అందుకే వీరికి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరగవు. దీనివల్ల వీరు మరణించే ప్రమాదం చాలా వరకు తక్కువగా ఉందంట. పెళ్లి తర్వాత పురుషులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి భార్య ఎప్పుడూ అండగా ఉంటుంది. అలాగే వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకుంటుంది.. దీంతో ఎలాంటి వ్యాధులు, అనారోగ్యానికి ఎక్కువ గురవరు అంటున్నారు నిపుణులు.
2024-05-17T13:06:28Z
Money Astrology: మే 17 ధన జ్యోతిష్యం. వారికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది
(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 17వ తేదీ, శుక్రవారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):వ్యాపారంలో ముఖ్యమైన పనులను ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సానుకూలంగా ఉంటుంది. మంచి డీల్ వచ్చే అవకాశం కూడా ఉంది. యువతకు సరైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత ఉద్యోగం లేదా వ్యాపారంలో లాభం ఉంటుంది. పరిహారం: ఆఫీస్లో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వృషభం (Taurus):ప్రస్తుతం వ్యాపారంలో వచ్చే నష్టాలను అంగీకరించడం మంచిది. ప్రత్యర్థుల కదలికలపై దృష్టి పెట్టవద్దు. వ్యాపారాన్ని పెంచుకోవడానికి సాయం చేసే ఏదైనా ప్లాన్ మీ చేతికి రావచ్చు. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యత మీపై పడవచ్చు. పరిహారం: విష్ణువును పూజించండి. మిథునం (Gemini):ఏ శుభ కార్యమైనా ఈరోజు పూర్తి చేస్తే, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. దీంతో పాటు ప్రస్తుత పనులు సజావుగా సాగుతాయి. బ్యాంకింగ్, లాయర్, సీఏ వంటి ప్రొఫెషన్స్కు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆఫీసు బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తారు. పరిహారం: శివలింగానికి నీటిని సమర్పించండి. కర్కాటకం (Cancer):ఆఫీస్లో కొత్త పనులు ప్రారంభించవద్దు. ఎందుకంటే ఇప్పుడు కష్టపడి పనిచేసినా సరైన ప్రయోజనాలు అందవు. స్థిరాస్తి, కమీషన్, వస్త్రాలు మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో లాభం ఉంటుంది. పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి. సింహం (Leo):ప్రొఫెషనల్ రిలేషన్స్ గౌరవించండి. ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయండి. ఆర్థిక విషయాలలో స్పష్టంగా ఉండండి. ఉద్యోగస్తులు బాగా పని చేస్తారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. ఆఫీస్లో క్రమశిక్షణను కొనసాగించండి. మీ కష్టానికి విలువ ఉంటుంది. వ్యాపారంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: లక్ష్మీదేవికి ఖీర్ ప్రసాదం పెట్టండి. కన్య (Virgo):ఇంట్లో కొత్త వనరులు పెరుగుతాయి. ఆర్థిక, వ్యాపార ప్రయత్నాలలో సెంటిమెంట్ ఉండకూడదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, మీ ప్రవర్తనపై సానుకూల నియంత్రణ ఉండేలా చూసుకోండి, దీనివల్ల ప్రయోజనం పొందుతారు. పని వాతావరణం బాగుంటుంది. పరిహారం: హనుమంతుని గుడిలో జెండా సమర్పించండి. తుల (Libra):ఆస్తి లేదా షేర్లు మొదలైన వాటిలో పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్కు సంబంధించిన పనులను ప్లాన్ చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. సాహిత్యం, కళలకు సంబంధించిన వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీరు శ్రమకు తగ్గ ప్రయోజనం పొందుతారు. పెద్దలు, అనుభవజ్ఞుల సహాయం, గైడెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. పరిహారం: వినాయకుడికి మోదకం సమర్పించండి. వృశ్చికం (Scorpio):వ్యాపారంలో ముఖ్యమైన విషయాలను పెండింగ్లో ఉంచడం మానుకోండి. కొత్త వ్యాపారంలో పార్ట్నర్షిప్ బలంగా ఉంటుంది. ఆఫీసులో టీమ్ స్పిరిట్ ఉంటుంది. పని, యాక్టివిటీ పెరుగుతుంది. స్థిర ఆస్తులకు సంబంధించిన పనుల్లో వేగం ఉంటుంది. పరిశ్రమలు, వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. పరిహారం: గోశాలకు ఆర్థిక సహాయం చేయండి. ధనస్సు (Sagittarius):ఐరన్ వర్క్తో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఊహించని ఫలితాలు ఉంటాయి. ప్రస్తుత వ్యవహారాలపైనే దృష్టిని పెంచండి. ఆఫీస్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితితో పాటు వ్యాపారం సాధారణంగా ఉంటుంది, ముఖ్యమైన విషయాల్లో తొందరపడకండి. వ్యక్తిగత ఖర్చులపై నియంత్రణ ఉంటుంది. పరిహారం: నల్ల కుక్కకు సేవ చేయండి. మకరం (Capricorn):ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యాపారంలో ఉత్సాహం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో బూమ్ చూస్తారు. ఆర్థిక విషయాలలో యాక్టివ్గా ఉంటారు. పోటీలో విజయ భావం ఉంటుంది. ఆఫీసులో ముఖ్యమైన పనులపై దృష్టి పెడతారు. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. పరిహారం: శివునికి ధాతురాన్ని సమర్పించండి. కుంభం (Aquarius):ఉద్యోగస్తులకు లాభాలు పెరుగుతాయి. బోనస్ లేదా అదనపు ఆదాయం ఉండవచ్చు. వ్యాపారస్తుల సామర్థ్యం పెరుగుతుంది, కొత్త ఆర్డర్లు అందుకోవచ్చు. ఏ పనినీ రేపటికి వాయిదా వేయకండి. సానుకూల పనితీరును కొనసాగించండి. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పరిహారం: గణేశ మంత్రాన్ని జపించండి. మీనం (Pisces):వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. సహకార భావం పెరుగుతుంది. వ్యాపార విషయాలలో సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. పని విస్తరణ ఆశించిన విధంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. డిస్ప్లే ఆర్ట్స్ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. పరిహారం: అనాథాశ్రమానికి ఫ్యాన్లు దానం చేయండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-05-16T23:49:04Z