సమ్మర్‌లో ఈ కుండలు చేసే మేలు అంత ఇంత కాదు..!!

సమ్మర్ వచ్చిందంటే మట్టి కుండలకు మంచి గిరాకీ ఉంటుంది. మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంటూ వైద్యులు కూడా చెబుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నప్పటికీ కుండలో నీళ్లు తాగితేనే మంచిది అని సమ్మర్ కి మట్టి కుండలు ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది.
ఈ సమ్మర్ కి మార్కెట్లోకి రకరకాల కుండలువచ్చాయి. వినియోగదారులు అభివృద్ధికి తగ్గట్టు మట్టి కుండలను అమ్మకాలు చేస్తున్నారు నిర్వాహకులు.
సాధారణ కుండనుండి మోడరన్ కుండల వరకు అన్ని రకాలు విశాఖలో అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు కుండలో నీళ్లు తీసుకొని తాగడం జరిగేది. కానీ ఇప్పుడు వినియోగదారులు అభివృద్ధి తగ్గట్లు కుండలకుకొళాయి ఏర్పాటు చేయడం జరిగింది.
కుండలోనీళ్లు వేసిన తర్వాత కుళాయి ద్వారా నీళ్లు పట్టుకుని తాగడం సింపుల్ గా ఉన్నది. ప్రస్తుతం కుళాయి ఉన్న కుండలకు అధిక శాతం అమ్మకాలు జరుగుతున్నాయని నిర్వాహకులు అంటున్నారు.
స్థానికంగా ఉన్న కుండలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మోడ్రన్ కుండలుకూడా విశాఖలో అమ్మకాలు చేస్తున్నారు. ఈ మట్టి కుండల ధరలు 200 నుండి 800 వరకు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని , మీ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదని అంటున్నారు. విశాఖపట్నంలోని ఎవరికైనా కావాలనుకుంటే అక్కయ్యపాలెం వస్తే ఈ కుండలఅమ్మకాలు చేసే వీధి కనిపిస్తుందని అంటున్నారు.

2024-03-29T11:31:35Z dg43tfdfdgfd