ప్రస్తుత కాలంలో చాలా మందికి ఏ విషయంలోనూ పెద్దగా ఓపిక ఉండట్లేదు. చిన్న చిన్న కారణాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో పెళ్లి అనేది పవిత్రబంధం. ఒకరికొకరు కష్టాల్లో.. నష్టాల్లో.. జీవితాంతం తోడుగా ఉండేందుకు పెళ్లితో ఒక్కటవుతారు. అయితే విచక్షణ కోల్పోతున్న కొందరు చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్నారు. ఇంత సిల్లీ రీజన్కు కూడా విడాకులు తీసుంటారా ? అనేలా ప్రవరిస్తున్నారు. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లెలో ఓ విచిత్ర ఘటన చోటుసుకుంది. ఫ్రూట్ జ్యూస్ పండంటి కాపురంలో చిచ్చు పెట్టింది. పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువును భర్త పుట్టింట్లో వదిలేసేలా చేసింది.
విరాల్లోకి వెళితే.. గత నెల 24న కాసిరెడ్డిపల్లెకు చెందిన సుంకరి ప్రవీణ్కు మంచిర్యాలకు చెందిన ఓ యువతి (22)తో వివాహమైంది. పెళ్లయిన నాలుగో రోజే భర్త వధువును ఆమె తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. ఆ యువతి ఇంట్లో అన్నం తినటం లేదని.. జ్యూస్లే తాగుతుందని ప్రవీణ్ చెప్పాడు. ఆమెను పుట్టింట్లో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇదే విషయమై అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కనుకున్నారు. అయితే వారు తమకేమీ సంబంధం లేదని... నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకుందామని చెబుతూ మాట దాటవేస్తూ వచ్చారు. అమ్మాయితో కాపురం చేయటం అబ్బాయికి ఇష్టం లేదని అందుకే ఏవో సాకులు చెబుతూ తమ కూతురు జీవితం నాశనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ అమ్మాయిని మెట్టినింటికి తీసుకెళ్తే.. తాళం వేసుకొని బయటకు వెళ్తున్నారని చెప్పారు. ఆ మేరకు అమ్మాయితో కలిసి బంధువులు వరుడు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై కౌన్సిలింగ్కు రావాలని వారిని స్టేషన్కు పిలిపించారు.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-05-06T06:51:20Z dg43tfdfdgfd