తత్తూరు స్వీట్స్ తిన్నారా.. స్పెషాలిటీ ఇదే, ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు!
500 సంవత్సరాల చరిత్ర గల తత్తూరు రంగనాథ స్వామి తిరుణాలలో పెద్దపెద్ద స్వీట్ షాప్ లో చాలా చక్కగా ఎంతో రుచికరమైన స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వీట్ అన్ని మన కళ్ళు ఎదురుగానే తయారుచేసి అమ్మకాలు జరుపుతారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరుణాల ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తిరుణాల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తరలివచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తిరునాళ్లను తిలకించేందుకు వెళ్తూ ఉంటారు. తిరుణాలలో భాగంగా పెద్దపెద్ద స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు, తత్తూరు తిరునాళ్లకు ముఖ్యమైనవిగా ఈ స్వీట్ షాపులు అని చెప్పవచ్చును. తిరుణాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ తయారు చేసే స్వీట్లు కొనుగోలు చేయనిదే వారి గ్రామాలకు వెళ్ళరు. జాంగిర్, మైసూర్ పాక్, బాదుషా, తీయకారాలు, మిచ్చెర, తీయని బెండ్లు, ఇలా మొదలైనవి అన్ని అమ్మకాలు జరుపుతున్నారు. దాదాపుగా 80 సంవత్సరాల నుంచి మహమ్మద్ రఫీ, వారి కుటుంబ సభ్యులు తత్తూరు జాతరలో ఇలా స్వీట్ షాపుల టెంట్లు వేసి, రకరకాల స్వీట్ అమ్మకాలు జరుపుతూ ఉన్నామని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తత్తూరు రంగనాథ స్వామి దర్శించుకొని స్వీట్ కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారని అమ్మకాలు బాగానే జరుగుతూ ఉన్నాయని తెలిపారు. పూర్వం నుంచి ఇక్కడే మా వంశస్థులు స్వీట్ అమ్మకాలలో మా ప్రత్యేకత ఉంది.
2024-05-02T09:18:22Z
శ్రీశైలంలో పక్షులకు ముంతల్లో ఆహారం, నీళ్లు ఏర్పాటు.. భలే ఐడియా..
నంద్యాల జిల్లా శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉద్యానవనం పార్కులో ఉదయం, సాయంకాలం అనేక రకాల పక్షులన్నీ అక్కడికి చేరుకుని సందడి చేస్తుంటాయి. అసలే వేసవి కాలం కావటంతో వాటన్నిటికీ ఆహార పదార్థాలు, ధాన్యం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ నిర్వాహుకులు. ఉద్యానవనంలో కొన్ని మట్టితో తయారీ చేసిన ముంతలను ఏర్పాటు చేసి వివిధ రకాల ధాన్యపు గింజలు అన్నిటిని వేయడంతో పక్షుల అన్నిటికీ ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఆలయ ఈవో డి పెద్దిరాజు. అసలే తీవ్రమైన ఎండతో మనుషులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్ని ప్రాణులైనా పక్షులన్నీ ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా పక్షులు మరణించడం జరుగుతోంది. అలాంటి వాటన్నిటికీ కొంతైనా మనం ఆహారం అందించాలి అనే ఆలోచనతో ఈ విధమైన నిర్ణయం దేవస్థాన అధికారులు తీసుకోవడం జరిగింది. ఈ ఉద్యానవనంలో వేల రకాల మొక్కలను నాటడం కూడా జరిగింది. చాలా వరకు అధికంగా చెట్ల కింద నీడ ఎక్కువగా ఉంటుంది. పక్షులన్నింటికీ నీడ ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. పక్షులన్నీ ఒకే చోట చేరి ధాన్యాన్ని ముంతలో ఉంచి మరో ముంతలో నీరును ఉంచడంతో ఎక్కవగా పక్షులు వచ్చి నీరు తాగుతూ ఆహారాన్ని తింటున్నాయి. ఇలా పక్షులన్నిటికీ శంకరావనం, సర్వతోభద్రవనం, బ్రహ్మరీ వనం, గులాబీ వనం, మల్లమ్మ తోట, శ్రీ పర్వతావనం, తదితర వనాలలో పక్షులకు ఆహారంగా ధాన్యపు గింజలను అందుబాటులో ఉంచారు. వాటి ఆహారాన్ని తీర్చే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆలయ ఈవో, డి పెద్దిరాజు లోకల్ 18తో ముచ్చటించారు.
2024-05-02T13:03:53Z